భారత వైమానిక దళానికి తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల (ఎల్బీపీవీ) మొదటి విడత సరఫరా పూర్తి చేశామని అశోక్ లేలాండ్ తెలిపింది. లాక్హీడ్ మార్టిన్కు చెందిన సీపీఎన్జీ(కామన్ వెహికల్ నెక్ట్స్జెన్) వెర్షన్ ఆధారంగా తయారుచేసిన ఈ అధునాతన వాహనాలను 13న అందజేశామని ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలియజేసింది.
లాక్హీడ్ మార్టిన్ నుంచి ఆశోక్ లేలాండ్కు సాంకేతిక బదలాయింపుతో ఈ వాహనాలను అభివృద్ధి చేశామని భారత్లోనే పూర్తిగా వీటిని తయారు చేశామని పేర్కొంది. బురద, ఇసుక, రాళ్లు ఉన్న రహదారులతో పాటు తక్కువ లోతున్న నీళ్లపైనా ఈ ఎల్బీపీవీలు సునాయాసంగా వెళ్లగలవు. ఇందులో ఆరుగురు ప్రయాణం చేసేందుకు వీలుండటంతో పాటు సామగ్రి పెట్టుకునేందుకు తగినంత స్థలమూ ఉంటుంది. తుపాకీ గుళ్ల దాడి నుంచే కాదు బాంబు పేలుళ్ల నుంచి కూడా ఇవి రక్షణ కల్పిస్తాయి.