తెలంగాణ

telangana

ETV Bharat / briefs

463మంది భారత యాత్రికులకు పాక్ వీసా - మహారాజ రంజిత్ సింగ్​

మహారాజ రంజిత్ సింగ్ వర్ధంతి సందర్భంగా 463మంది భారత సిక్కు యాత్రికులకు​ వీసాలు జారీ చేసింది పాకిస్థాన్​.

భారత యాత్రికులకు పాక్ వీసా

By

Published : Jun 25, 2019, 8:08 AM IST

463 మంది భారత యాత్రికులకు పాక్ వీసా

ఈ నెల 27 నుంచి జులై 6 వరకు జరగనున్న 'మహారాజ రంజిత్ సింగ్'​ వర్ధంతి నేపథ్యంలో 463 మంది భారత సిక్కు యాత్రికులకు వీసాలు మంజూరు చేసింది పాకిస్థాన్​​. భారత్​ సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న సిక్కులకు వీసాలు జారీ చేసినట్టు పాక్​ హై కమిషన్​ వెల్లడించింది.

జూన్​ 14-23 మధ్య 'గురు అర్జున్​ దేవ్​ జీ' బలిదాన దినాన్ని పురస్కరించుకొని సిక్కు యాత్రికులకు వీసాలు ఇచ్చింది పాక్.

పుణ్యక్షేత్రాల సందర్శనల కోసం 1974లో భారత్​-పాక్​ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కారణంగా ప్రతి ఏటా వేలాది మంది భారత యాత్రికులు పాకిస్థాన్​లో జరిగే మతపరమైన ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.

ఇదీ చూడండి: 'గంగా ప్రక్షాళనకు రూ. 28 వేల కోట్లు మంజూరు'

ABOUT THE AUTHOR

...view details