కొవిడ్-19 దృష్ట్యా పాఠశాలలు పునఃప్రారంభం కాని నేపథ్యంలో విద్యార్థులను కష్టాలు పలకరిస్తున్నాయి. ఆన్లైన్ పాఠాల కోసం కర్ణాటకలోని విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నమక్కల్ జిల్లా పెరపంచోళై, పెరియ గొంబాయ్ గ్రామాల్లోని విద్యార్థులు సిగ్నల్ కోసం సాహసాలే చేస్తున్నారు. గ్రామంలోని ఎత్తైన చెట్లు ఎక్కి ఆన్లైన్ పాఠాలు వింటున్నారు.
ఆన్లైన్ పాఠాల కోసం విద్యార్థుల సాహసాలు
కరోనా వేళ.. ఆన్లైన్ పాఠాల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సాహసాలు చేస్తున్నారు. సిగ్నల్స్ అందక.. చెట్లు, కొండలు, గుట్టలు ఎక్కి పాఠాలు వింటున్నారు. కర్ణాటక నమక్కల్లోని విద్యార్థులు ఇలాంటి కష్టాలనే ఎదుర్కొంటున్నారు.
ఆన్లైన్ పాఠాల కోసం విద్యార్థులు
గ్రామంలో సెల్ఫోన్ టవర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో సెల్ఫోన్ టవర్ ఏర్పాటుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రేయ సింగ్ తెలిపారు.
ఇదీ చదవండి:పెళ్లంటే భయం- కవలలు ఆత్మహత్య!