తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఒకే ర్యాంకు- ఒకే పింఛన్'​​పై రాహుల్​ ప్రశ్నల వర్షం - ఒక ర్యాంకు ఒక పెన్షన్​ రాహుల్​ ప్రశ్నలు

పదవీ విరమణ పొందిన సైనిక అధికారులకు ఇచ్చే 'ఒకే ర్యాంకు ఒకే పింఛన్​' అంశమై పార్లమెంటరీ స్థాయి సంఘంలో ప్రశ్నలు లేవనెత్తారు రాహుల్​ గాంధీ. అయితే.. 40ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశామని.. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని రక్షణ శాఖ బదులిచ్చింది.

Rahul Gandhi questions Defence Ministry officials on OROP revision at parliamentary panel meet
'ఒకే ర్యాంకు ఒకే పింఛన్'​​పై రాహుల్​ వాగ్వాదం!

By

Published : Feb 20, 2021, 9:12 AM IST

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.. రక్షణ శాఖ నిర్వహించిన పార్లమెంటరీ స్థాయి సంఘంలో.. పెండింగ్​లో ఉన్న 'ఒకే ర్యాంకు ఒకే పింఛన్(ఓఆర్​ఓపీ)' విషయమై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే.. ఏళ్ల తరబడి పెండింగ్​లో ఉన్న విధానంలో పరిష్కరించాల్సిన సమస్యలు మరికొన్ని ఉన్నాయని రక్షణ శాఖ అధికారులు ప్యానెల్​కు సమాధానమిచ్చారు. వీటిని పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశామని.. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా సమీక్షిస్తామని తెలిపారు.

సైన్యాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ సహా ముగ్గురు సాయుధ దళాల ఉన్నతాధికారులు, రక్షణ కార్యదర్శి అజయ్​ కుమార్​ గురువారం ప్యానెల్​ ఎదుట పదవీ విరమణ పొందారు. భాజపా సీనియర్​ నాయకుడు జుయల్​ ఓరమ్​ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో.. ఛైర్మన్​, రాహుల్​ల మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే.. ఈ సమావేశం ఎజెండాలో లేదని ఛైర్మన్​ చెప్పడం వల్ల అంతటితో వాగ్వాదానికి తెరపిడినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం శుక్రవారం ఓ మర్యాదపూర్వక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

40ఏళ్లుగా పెండిగ్​లో ఉన్న ఓఆర్​ఓపీ అంశాన్ని పునఃపరిశీలించేందుకు గానూ.. గతేడాది జూన్​లో ఓ కమిటీని ఏర్పాటు చేసింది రక్షణ శాఖ.

ఇదీ చదవండి:'ఉత్తరాఖండ్' మృతులకు గుర్తుగా స్మృతి వనం

ABOUT THE AUTHOR

...view details