దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. కొత్తగా 96,982 మందికి వైరస్ సోకినట్టు తేలింది. మరో 446 మంది మహమ్మారికి బలయ్యారు.
- మొత్తం కేసులు: 1,26,86,049
- మొత్తం మరణాలు: 1,65,547
- కోలుకున్నవారు: 1,17,32,279
- యాక్టివ్ కేసులు: 7,88,223
వైరస్ సోకిన వారిలో సోమవారం 50,143 మంది కోలుకున్నారు. దేశవ్యాప్త రికవరీ రేటు 92.48 శాతానికి తగ్గగా.. మరణాల రేటు 1.30 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.