Husband dies accident Mangaluru: భర్త చనిపోయాడన్న బాధతో తన ఆరు నెలల కుమారుడిని చంపి, ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ఈ ఘటన కర్ణాటక రాయ్చూర్లో శనివారం రాత్రి 10 గంటలకు జరిగింది. గంగాధర్ బి కమ్మర(36), శ్రుతి(30) భార్యాభర్తలు. వీరికి ఆరు నెలల కుమారుడు అభిరామ్ ఉన్నాడు. మంగళూరులోని అగ్నిమాపక దళంలో గంగాధర్ డ్రైవర్గా ఉద్యోగం చేస్తున్నాడు. రాయ్చూర్లో ఈయన కుటుంబం నివాసం ఉంటోంది.
పసి బిడ్డను చంపి, మహిళ ఆత్మహత్య.. భర్త మరణవార్త విన్న నిమిషాల్లోనే..
Husband dies accident Mangaluru: భర్త మరణవార్త విని తట్టుకోలేక ఓ భార్య తన ఆరు నెలల కుమారుడిని చంపి, ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం రాత్రి కర్ణాటకలోని రాయ్చూర్లో జరిగింది.
శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగాధర్ మరణించాడు. కుంటికాన సమీపంలో గంగాధర్ రోడ్డు దాటుతుండగా బెంగళూరు నుంచి కుందాపుర్ వెళ్తున్న కారు ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం రాయచూర్లో ఉన్న అతని భార్యకు తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఆమె షాక్కు గురైంది. భర్త మరణ వార్త విని తట్టుకోలేకపోయింది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో తన ఆరు నెలల చిన్నారి అభిరామ్ను హత్యచేసి, తాను ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. మంగళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు గంగాధర్ ఇంటికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:భార్యపై కోపం.. మరో ఇద్దరిని పిలిపించి గ్యాంగ్ రేప్