తెలంగాణ

telangana

By

Published : Feb 6, 2022, 12:06 PM IST

Updated : Feb 6, 2022, 3:07 PM IST

ETV Bharat / bharat

ఒకే కుటుంబంలోని ఐదుగురు దారుణ హత్య- ఏం జరిగింది?

Mandya murder case: కర్ణాటక మండ్య జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. బంగారం, ధనం కోసం.. కనికరం లేకుండా చంపేశారు.

Five members of same family killed in Madya district, Karnataka
ఐదుగురు హత్య

Mandya murder case: కర్ణాటకలోని మండ్యలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఇందులో ఓ మహిళ, నలుగురు చిన్న పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మండ్య జిల్లా శ్రీరంగపట్నం తాలూకాలోని కేఆర్‌ఎస్ సమీపంలోని బజార్ లైన్‌లో ఈ విషాద ఘటన జరిగింది. మృతులను గంగారాం భార్య లక్ష్మీ(30), వారి పిల్లలు రాజు(12), కోమల్(7)​, కునాల్(4), గంగారాం సోదరుడి కుమారుడు గోవింద్​గా(12) గుర్తించారు.

గంగారాం, అతడి సోదరుడు గణేశ్.. ప్లాస్టిక్​ అలంకరణ సామగ్రి వ్యాపారులు. కర్ణాటకలోనే కాకుండా.. వ్యాపార నిమిత్తం ఇతర రాష్ట్రాలకూ వెళ్తుంటారు. ఒక్కోసారి తిరిగివచ్చేందుకు 15-30 రోజులు పడుతుంది. ఈ క్రమంలోనే.. గంగారాం రెండు రోజులుగా ఊళ్లో లేడు. ఇది తెలుసుకున్న కొందరు దుండగులు.. అతడి ఇంట్లోకి చొరబడి నిద్రలోనే గంగారాం కుటుంబసభ్యులను దారుణంగా చంపేశారు.

భారీగా నగలు, డబ్బు తీసుకొని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఓ ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఇదీ చూడండి:ముగ్గురు పాక్​ స్మగ్లర్లు హతం.. 36 కిలోల హెరాయిన్​ స్వాధీనం

Last Updated : Feb 6, 2022, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details