తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య - family suicide in Tamilnadu

తమిళనాడులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధ భరించలేక ఆ కుటుంబం ఈ ఘాతుకానికి పూనుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Family Die of suicide unable to pay interest for debt
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

By

Published : Dec 14, 2020, 6:28 PM IST

తమిళనాడు విల్లుపురం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు పిల్లలను చంపి, భార్యాభర్తలు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను మోహన్​(38), విమలశ్రీ(32), రాజశ్రీ(8), నిత్యశ్రీ(7), శివబాలన్​(5)గా అధికారులు గుర్తించారు.

'వలవనూర్​ పుడుపాలయంకు చెందిన మోహన్​ కార్పెంటర్​ పని చేసేవాడు. కరోనా కారణంగా పని లేకుండా పోయింది. అందుకే మోహన్​.. ఇంటిని తాకట్టు పెట్టి రూ.50 లక్షలు అప్పు చేసి ఓ వ్యాపారం ప్రారంభించాడు. అయితే లాభాలు రాకపోవడం వల్ల వడ్డీ కట్టలేక.. ఆర్థికంగా ఇబ్బందులు పాలయ్యాడు. దీంతో కుటుంబం సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు' అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఇదీ చూడండి:రూ.24 లక్షల నీటి బిల్లు బాకీపడ్డ సీఎం, మంత్రులు

ABOUT THE AUTHOR

...view details