తౌక్టేను మరవక ముందే దేశంలో మరో తుపాను కలవరపెడుతోంది. 'యాస్' తుపాను మే 26 నాటికి అతి తీవ్ర తుపానుగా మారి ఒడిశా, బంగాల్ తీరాలను దాటనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం, అండమాన్ సముద్రం ఉత్తర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది.
మే 26 నాటికి అతి తీవ్ర తుపానుగా 'యాస్'
దేశంలో మరో తుపాను 'యాస్' సంభవించనుంది. మే 26 నాటికి అతి తీవ్ర తుపానుగా మారి ఒడిశా- బంగాల్ మధ్య తీరాలను దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
తుపాను
మే 23 నాటికి అల్పపీడనంగా మారి వాయవ్య దిశగా ప్రయాణించనుందని వాతావరణ శాఖ తెలిపింది. మే 24కు తుపానుగా పరిణామం చెంది ఆ తర్వాత 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని వెల్లడించింది. తౌక్టే తుపాను ఇప్పటికే పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేసింది. గుజరాత్లో బీభత్సం సృష్టించింది.
ఇదీ చదవండి: ఆదివారం కేంద్ర విద్యాశాఖ కీలక సమావేశం
Last Updated : May 22, 2021, 3:30 PM IST