తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శిరోమణి అకాలీదళ్​ అధినేత వాహనంపై దాడి - Clashes between Akali dal and Congress

పంజాబ్​లో కాంగ్రెస్-శిరోమణి అకాలీదళ్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో అకాలీదళ్​ పార్టీ అధ్యక్షుడు సుఖ్​బీర్​ సింగ్​ బాదల్ వాహనంపై దాడి చేశారు కొందరు దుండగులు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

Clashes between Akalis and Congress in Jalalabad, aerial firing updates
శిరోమణి అకాలీదళ్​ అధినేత వాహనంపై దాడి

By

Published : Feb 2, 2021, 11:46 PM IST

పంజాబ్​లోని జలాలాబాద్​లో శిరోమణి అకాలీదళ్​ అధ్యక్షుడు సుఖ్​బీర్ సింగ్ బాదల్​ వాహనంపై దాడి జరిగింది. స్థానికుల ఎన్నికల కోసం నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి తహశీల్దార్ కార్యాలయానికి సుఖ్​బీర్​ సింగ్​ నేతృత్వంలో అకాలీదళ్​ అభ్యర్థి వెళ్లిన నేపథ్యంలో ఇరు వర్గాల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

శిరోమణి అకాలీదళ్​ అధినేత వాహనంపై దాడి

ఆయన ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకుని కొందరు రాళ్లు విసిరారు. పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని దాడికి యత్నించారు. ఈ ఘటనలో సుఖ్​బీర్​ సింగ్ కారు దెబ్బతింది. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

ఇదీ చూడండి:'ఆదిపురుష్​' సినిమా సెట్​లో భారీ అగ్ని ప్రమాదం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details