కరోనా విజృంభణతో మాస్కులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రధాన నగరాల్లోనూ సరిగా దొరకని పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ సమస్యను ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలోని అమాబేడాలో ఉండే గిరిజనులు సునాయాసంగా అధిగమించారు. వినూత్న ఆలోచనను అమలు చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు.
కరోనా నుంచి రక్షణ కోసం ప్రకృతి సిద్ధమైన మాస్కులను స్వయంగా తయారు చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు అమాబేడా వాసులు. ఇందుకోసం ఊరిలో దొరికే సాల్ చెట్టు ఆకులు వినియోగిస్తున్నారు.