బంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్కు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. సీఆర్పీఎఫ్ బలగాలతో జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. గవర్నర్కు భద్రత పరంగా ముప్పు ఉందన్న సమాచారం మేరకు ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
దేశంలో ఆయన ఎక్కడికి ప్రయాణించినా దాదాపు 8 నుంచి 9 మందితో కూడిన సాయుధ బృందం గవర్నర్ వెంట ఉండనుంది. త్వరలోనే భద్రతా బలగాలు ఆయన బాధ్యతను తీసుకుంటాయని అధికారులు తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సహా పలువురు వీఐపీలకు సీఆర్పీఎఫ్ జెడ్ కేటగిరీ భద్రత ఉంది.