కరోనా కారణంగా ప్రస్తుత విద్యావిధానం ఆన్లైన్ ద్వారానే కొనసాగుతోంది. అయితే మొబైల్ గేమ్స్ అనగానే సంబరపడిపోయే పిల్లలు.. ఈ ఆన్లైన్ తరగతుల పేరిట ఫోన్లను మరో విధంగా ఉపయోగిస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒడిశాలోని కియోంజర్లో జరిగింది.
'ఫ్రీ ఫైర్' కోసం లక్ష ఖర్చు
జోడా పారిశ్రామిక నగరంలోని కమర్జోడా మురికివాడకు చెందిన వినోద్ అపాట్ అనే వ్యక్తి కొడుకు అమితాన్షు అపాట్(14).. సరస్వతి శిశు మందిర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ తరగతుల కోసం తన తండ్రి అతనికి రూ.13,000తో ఓ ఫోన్ కొనిచ్చాడు.