తెలంగాణ

telangana

By

Published : Apr 17, 2019, 9:21 PM IST

ETV Bharat / bharat

రాజ్​నాథ్​పై లఖ్​నవూ బరిలో పూనమ్​ సిన్హా

ప్రముఖ నటుడు, రాజకీయ నేత శతృఘ్న సిన్హా భార్య.. పూనమ్​ సిన్హాను లఖ్​నవూ బరిలో నిలిపింది సమాజ్​వాది పార్టీ. ఇదే స్థానం నుంచి భాజపా నాయకుడు, కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పోటీ చేస్తున్నారు.

రాజ్​నాథ్​కు పోటీగా లఖ్​నవూ బరిలో పూనమ్​ సిన్హా

రాజ్​నాథ్​కు పోటీగా లఖ్​నవూ బరిలో పూనమ్​ సిన్హా

కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​కు పోటీగా లఖ్​నవూ లోక్​సభ స్థానానికి ప్రముఖ నటుడు, రాజకీయ నేత శతృఘ్న సిన్హా భార్య పూనమ్​ సిన్హాను బరిలో దింపింది సమాజ్​వాది పార్టీ. పూనమ్​ పార్టీలో చేరిన మరుసటి రోజునే ఆమె అభ్యర్థిత్వన్ని ప్రకటించారు ఎస్పీ అధినేత అఖిలేశ్​ యాదవ్.​

రాజ్​నాథ్​ సింగ్​ లఖ్​నవూ స్థానానికిమంగళవారం నామపత్రాలు​ దాఖలు చేశారు. 2014 లోక్​సభ ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించిన హోంమంత్రి మరోమారు ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు.

లఖ్​నవూలో ఎస్పీ నేత అఖిలేశ్​ యాదవ్​ సతీమణి డింపుల్​ యాదవ్​ ఆధ్వర్యంలో మంగళవారం రోజు పార్టీలో చేరారు పూనమ్​ సిన్హా.

ఏప్రిల్​ 18న లఖ్​నవూ స్థానానికి పూనమ్​ నామినేషన్​ వేసే అవకాశముంది. నియోజకవర్గంలో మే 6 న పోలింగ్​ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details