కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు పోటీగా లఖ్నవూ లోక్సభ స్థానానికి ప్రముఖ నటుడు, రాజకీయ నేత శతృఘ్న సిన్హా భార్య పూనమ్ సిన్హాను బరిలో దింపింది సమాజ్వాది పార్టీ. పూనమ్ పార్టీలో చేరిన మరుసటి రోజునే ఆమె అభ్యర్థిత్వన్ని ప్రకటించారు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.
రాజ్నాథ్ సింగ్ లఖ్నవూ స్థానానికిమంగళవారం నామపత్రాలు దాఖలు చేశారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించిన హోంమంత్రి మరోమారు ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు.