పౌరసత్వ చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ పలు చోట్ల నిరసనలు చెలరేగాయి. దిల్లీ పార్లమెంటు ప్రాంగణం, అసోం, త్రిపుర, బంగాల్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో పలు పార్టీలు, సంఘాలు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగాయి.
పార్లమెంటు సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) ఎంపీలు ధర్నా చేపట్టారు. ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) సభ్యులు.. దిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు.
''మేం ఈ బిల్లుకు వ్యతిరేకం. ఇది రాజ్యాంగానికి, హిందూ-ముస్లింల ఐక్యతకు పూర్తి విరుద్ధం.''
- బద్రుద్దిన్ అజ్మల్, ఏఐయూడీఎఫ్ ఎంపీ- ధుబ్రి, అసోం