తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌరసత్వ బిల్లు'పై ఈశాన్య భారతాన ఆగ్రహజ్వాల - Badruddin Ajmal, AIUDF MP from Dhubri, Assam

వివాదాస్పద పౌరసత్వ బిల్లుపై వేర్వేరు చోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. బిల్లుకు వ్యతిరేకంగా దిల్లీ, ఈశాన్య రాష్ట్రాల్లో పలు సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఈ ఉద్రిక్త పరిణామాల నడుమ కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ఇవాళ లోక్​సభలో బిల్లును ప్రవేశపెట్టారు.

protests-over-citizenship-amendment-bill-in-delhi-elsewhere-in-country
'పౌరసత్వ బిల్లు'పై ఈశాన్య భారతాన ఆగ్రహజ్వాల

By

Published : Dec 9, 2019, 4:48 PM IST

Updated : Dec 9, 2019, 7:56 PM IST

'పౌరసత్వ బిల్లు'పై ఈశాన్య భారతాన ఆగ్రహజ్వాల

పౌరసత్వ చట్ట సవరణ బిల్లును లోక్​సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ పలు చోట్ల నిరసనలు చెలరేగాయి. దిల్లీ పార్లమెంటు ప్రాంగణం, అసోం, త్రిపుర, బంగాల్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో పలు పార్టీలు, సంఘాలు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగాయి.

పార్లమెంటు సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ఇండియన్​ యూనియన్​ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్​) ఎంపీలు ధర్నా చేపట్టారు. ఆల్​ ఇండియా యునైటెడ్​ డెమొక్రటిక్​ ఫ్రంట్​(ఏఐయూడీఎఫ్​) సభ్యులు.. దిల్లీ జంతర్​ మంతర్​ వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు.

''మేం ఈ బిల్లుకు వ్యతిరేకం. ఇది రాజ్యాంగానికి, హిందూ-ముస్లింల ఐక్యతకు పూర్తి విరుద్ధం.''

- బద్రుద్దిన్​ అజ్మల్​, ఏఐయూడీఎఫ్​ ఎంపీ- ధుబ్రి, అసోం

దిల్లీతో సహా.. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపురలోనూ పలు పార్టీలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. బిల్లును నిరసిస్తూ వివిధ సంఘాల పిలుపు మేరకు.. గువహటిలో స్వచ్ఛందంగా బంద్​ పాటించారు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు తెరుచుకోలేదు.

ఇవాళ లోక్​సభలో ప్రవేశం...

వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్​ షా నేడు.. పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లో మతపరమైన వేధింపులకు గురయ్యే ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.

ఇదీ చూడండి:పౌరసత్వ బిల్లుపై లోక్​సభలో మాటల యుద్ధం

Last Updated : Dec 9, 2019, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details