తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మీ మెరుపుదాడి పేదలపై- మాది పేదరికంపై' - బిహార్​

'న్యాయ్​' పథకం కాంగ్రెస్​ పార్టీ పేదరికంపై చేసే మెరుపుదాడని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ పునురుద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్లలో పేదలపై మెరుపుదాడి చేశారని, తాము పేదరికంపై చేసి చూపిస్తామని బిహార్​ ఎన్నికల ప్రచార సభలో స్పష్టంచేశారు.

మీ మెరుపుదాడి పేదలపై- మాది పేదరికంపై: రాహుల్​ గాంధీ

By

Published : Apr 26, 2019, 5:20 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదని కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ విమర్శించారు. పేదల డబ్బును బడా వ్యాపారులకు దోచిబెట్టారని ఆరోపించారు.

బిహార్‌లోని సమస్తీపుర్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి రాహుల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.

న్యాయ్​ పథకం కింద పేదలకు ఏటా రూ.72వేలు ఇస్తామన్న కాంగ్రెస్​ హామీపై విమర్శలను రాహుల్​ తోసిపుచ్చారు. ఆ కార్యక్రమం కోసం పన్నులు పెంచమని, మోదీ పాలనలో లాభపడ్డ బడా వ్యాపారవేత్తల నుంచే డబ్బు రాబడతామని చెప్పారు.

మీ మెరుపుదాడి పేదలపై- మాది పేదరికంపై: రాహుల్​ గాంధీ

"ఐదేళ్లలో మోదీ పేదలపై మెరుపుదాడి చేశారు. న్యాయ్ పథకం.. ఇది కాంగ్రెస్ పార్టీ పేదరికంపై చేస్తున్న మెరుపుదాడి. బిహార్​ యువత... ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంటే ఏ ప్రభుత్వ కార్యాలయం నుంచి అనుమతి అవసరం లేకుండా చేస్తాం. కాంగ్రెస్​ పార్టీ వారికి నేరుగా బ్యాంకు రుణాలు ఇప్పిస్తుంది. నీరవ్​ మోదీ, మెహుల్​ చోక్సీ, విజయ్​మాల్యా నుంచి మొత్తం డబ్బులు వసూలు చేసి బిహార్​ యువత బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. మోదీ ఒక్క మాట వినండి... మీరు లాలూకు చేసిన అవమానానికి 2019 ఎన్నికల్లో బిహార్ ప్రజలు సమాధానం చెబుతారు."
- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details