భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దాదాపు 300 లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్పోల్స్ వెల్లడించాయి. మళ్లీ అధికారం చేపడుతుందని స్పష్టం చేశాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు నిరాశ తప్పదని తేల్చేశాయి. కీలక రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బంగాల్, బిహార్, దిల్లీలలో భాజపా హవా ఉండడమే ఇందుకు కారణమని అంచనాలు వేశాయి.
మహారాష్ట్ర
మహారాష్ట్రలో మొత్తం లోక్సభ స్థానాలు 48. ఆ రాష్ట్రంలో భాజపా-శివసేన కలిసి పోటీకి దిగాయి. ఆ పార్టీల ఎన్డీఏ కూటమికే ప్రజల మద్దతు ఉందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. రాష్ట్రంలో మోదీ ప్రభంజనం తగ్గినప్పటికీ... శివసేన భారీగా సీట్లు పొందుతుందని అంచనా వేశాయి. ఎన్సీపీతో కలిసి బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీకి నిరాశ తప్పదని చెప్పాయి.
ఎగ్జిట్ పోల్స్ | ఎన్డీఏ | యూపీఏ | ఇతరులు |
టైమ్స్ నౌ | 38 | 10 | 0 |
సీ-ఓటర్ | 34 | 14 | 0 |
ఎన్డీ టీవీ | 36 | 11 | 1 |
జన్ కీ బాత్ | 38 | 9 | 1 |
పశ్చిమ బెంగాల్
బంగాల్లో మొత్తం లోక్సభ సీట్ల సంఖ్య 42. సార్వత్రిక ఎన్నికల ఏడు దశల్లోనూ పోలింగ్ జరిగింది. ఎన్నో హింసాత్మక ఘటనలు జరిగాయి. ప్రధాని మోదీ - తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీల మధ్య మాటల యుద్ధం సాగింది. కేంద్రంలో భాజపా ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా బరిలో దిగిన దీదీకి తీవ్ర నిరాశే ఎదురవుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బంగాల్లో భాజపా బలోపేతం అయిందని స్పష్టం చేశాయి.
ఎగ్జిట్ పోల్స్ | ఎన్డీఏ | తృణమూల్ కాంగ్రెస్ | యూపీఏ |
టైమ్స్ నౌ | 11 | 28 | 2 |
సీ-ఓటర్ | 11 | 29 | 2 |
ఎన్డీ టీవీ | 14 | 26 | 2 |
జన్ కీ బాత్ | 18-26 | 13-21 | 3 |
దిల్లీ