భారతీయ రైల్వే ఆదాయానికి కరోనా లాక్డౌన్ భారీగా గండి కొట్టిండి. ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోవడం వల్ల.. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఆదాయంలో 90శాతం క్షీణించింది. మొత్తం మీద ఈ ఏడాది రూ. 3,322కోట్లు ఆర్జించినట్టు రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ వెల్లడించారు..
"ప్యాసింజర్ సెగ్మెంట్ ద్వారా రైల్వే రూ. 3,322కోట్లను సంపాదించింది. గతేడాదితో పోల్చితే ఇది 90శాతం తక్కువ. ప్యాసింజర్ రైళ్లను పుర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వలతో కలిసి పనిచేస్తున్నాం. కరోనా పరిస్థితులను సమీక్షించి ఓ నిర్ణయం తీసుకుంటాం. అయితే కచ్చితమైన తేదీని ఇప్పుడే చెప్పలేం."
--- వినోద్ కుమార్, రైల్వే బోర్డు ఛైర్మన్.