తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైల్వే స్టేషన్లన్నీ ఇక వైఫై స్టేషన్లు! - సెప్టేంబర్​

దేశంలోని అన్ని ప్రధాన స్టేషన్లలో వినాయక చతుర్థి కల్లా వైఫై సదుపాయం కల్పించనున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్​ గోయల్​ ప్రకటించారు.

వైఫై

By

Published : Mar 9, 2019, 1:55 PM IST

ఆరు వేలకుపైగా రైల్వే స్టేషన్లలో సెప్టెంబర్​నాటికి వైఫై సదుపాయం కల్పించనున్నట్లు అ శాఖ మంత్రి పీయూష్​ గోయల్​ ప్రకటించారు. దిల్లీలో పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారాయన.

6,441 స్టేషన్లలో వైఫై సదుపాయం కల్పించనున్నాం. హాల్ట్​ స్టేషన్లు మినహా ప్రతి స్టేషన్​లోనూ ఈ సౌకర్యం కల్పిస్తాం. రైల్​టెల్​ ఈ ప్రాజెక్ట్​ పనులను పర్యవేక్షించనుంది. 160 సంవత్సరాల రైల్వే చరిత్రలో ఇది ఓ పెద్ద సామాజిక బాధ్యతా కార్యక్రమం. దీనికి భారీగా నిధులు అందించనున్న టాటా ట్రస్ట్​కు కృతజ్ఞతలు- పీయూష్​ గోయల్​, రైల్వే శాఖ మంత్రి

వైఫై వస్తోంది

వివిధ స్టేషన్లలో 2వేల 400 మూత్రశాలలు నిర్మించనున్నట్లు పీయూష్​ గోయల్​ తెలిపారు. తక్కువ ధరకు శానిటరీ ప్యాడ్స్​ అందించేందుకు స్టేషన్​ పరిసరాల్లో దుకాణాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details