తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సంఝౌతా' బోగీని తిరిగి పంపాలని పాక్​ను కోరిన భారత్​ - latest samjhotha express news

వాఘా సరిహద్దు వద్దనున్న సంఝౌతా ఎక్స్​ప్రెస్​ బోగీని పాక్​ తిరిగి పంపించాలని కోరింది భారత్​. ఇప్పటికే ఈ విషయంపై పాక్​కు విజ్ఞప్తి చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్​ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య రైల్వే సేవలు నిలిచిపోయాయి.

India asks Pakistan to return its rake used in Samjhauta Express
సంజౌతా ఎక్స్​ప్రెస్​ బోగీని తిరిగి పంపించాలని పాక్​ను కోరిన భారత్​

By

Published : Jan 14, 2020, 9:44 PM IST

ఐదునెలలుగా వాఘా సరిహద్దు వద్ద ఉన్న సంఝౌతా ఎక్స్​ప్రెస్​ బోగీని తిరిగి పంపించాలని పాకిస్థాన్​ను కోరింది భారత్​. జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్​-పాక్​ మధ్య సంఝౌతా ఎక్స్​ ప్రెస్​ సేవలు నిలిచిపోయాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ విషయంపై పాక్​కు విజ్ఞప్తి చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

జమ్ముకశ్మీర్​లో ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత భద్రతాపరమైన కారణాలు చూపుతూ.. వాఘా సరిహద్దు వద్ద గతేడాది ఆగస్టు 8న సంఝౌతా ఎక్స్​ప్రెస్​ను నిలిపేసింది దాయాది దేశం. ఆ సమయంలో దాదాపు 117 మంది ప్రయాణికులు రైలులో ఉన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అటారికి చేరుకోవాల్సిన ఈ రైలు... భారతీయ రైల్వే అధికారులు ఇంజిన్​, సిబ్బందిని పంపిస్తే సాయంత్రం 5.15 గంటలకు వాఘా నుంచి అటారికి చేరుకుంది.

ఆరునెలల ఒప్పందం

సంఝౌతాఎక్స్​ప్రెస్​ కోసం కోచ్​లను ఉపయోగించేందుకు ఇరు దేశాలు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. జనవరి నుంచి జూన్​ వరకు పాక్​ రేక్​లను ఉపయోగిస్తే.. జులై నుంచి డిసెంబరు వరకు భారత్​ రేక్​లను ఉపయోగిస్తుంది. సాధారణంగా రేక్​లు ఎప్పటికప్పుడు స్వదేశానికి తిరిగొస్తాయి. కానీ ఐదునెలల వరకు ఓ బోగీ ఇరు దేశాల మధ్య చిక్కుకోవడం ఇదే తొలిసారి.

ABOUT THE AUTHOR

...view details