తెలంగాణ

telangana

By

Published : Dec 24, 2019, 11:04 PM IST

ETV Bharat / bharat

గవర్నర్​ను కలిసిన సోరెన్​.. 29న ప్రమాణస్వీకారం!

జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్​ సోరెన్​ ఆ రాష్ట్ర గవర్నర్​తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం తమ వద్ద పూర్తి మెజార్టీ ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు సోరెన్​. ఈ నెల 29న సోరెన్​ ఝార్ఖండ్​ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది.

Hemant Soren meets J'khand Guv, stakes claim to form govt
గవర్నర్​ వద్దకు సోరెన్​.. 29న ప్రమాణస్వీకారం!

ఝార్ఖండ్​ గవర్నర్​ ద్రౌపది ముర్ముతో జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్​ సోరెన్​ సమావేశమయ్యారు. తాజా ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి గెలుపొందిన నేపథ్యంలో.. తమకు 50 మంది ఎమ్మెల్యేల మద్దుతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరారు.

ఏకగ్రీవ ఎన్నిక....

అంతకుముందు జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. హేమంత్​ సోరెన్​ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.

ప్రమాణస్వీకారం....

డిసెంబర్​ 29న మధ్యాహ్నం 1 గంటకు ఝార్ఖండ్​ ముఖ్యమంత్రిగా సోరెన్​ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు జేఎంఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య తెలిపారు.

కూటమికి 47 స్థానాలు...

81 స్థానాలు ఉన్న ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​-జేఎంఎం-ఆర్​జేడీ కూటమి మొత్తం 47 (జేఎంఎం-30, కాంగ్రెస్​-16, ఆర్​జేడీ-1) స్థానాల్లో గెలుపొంది సాధారణ మెజార్టీ కన్నా 5 సీట్లు ఎక్కువ సాధించింది.

కాంగ్రెస్​ నేతగా ఆలం..

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన శాసన సభ్యలు కలిసి ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా అలమ్‌గీర్ ఆలంను ఎన్నుకున్నారు.

ఇదీ చూడండి:రాహుల్​కు ప్రశాంత్​ కిషోర్​ 'కృతజ్ఞతలు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details