తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోహ్​తంగ్​కు మాజీ ప్రధాని వాజ్​పేయీ పేరు! - రోహ్​తంగ్​కు మాజీ ప్రధాని వాజ్​పేయీ పేరు!

దివంగత మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ జయంతిని పురస్కరించుకుని హిమాచల్​ప్రదేశ్​లోని వ్యూహాత్మక సొరంగ మార్గం రోహ్​తంగ్​కు ఆయన పేరు పెట్టాలని నిర్ణయించింది కేంద్రం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని ఆమోదించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

Vajpayee
రోహ్​తంగ్​కు మాజీ ప్రధాని వాజ్​పేయీ పేరు!

By

Published : Dec 25, 2019, 5:56 AM IST

Updated : Dec 25, 2019, 8:20 AM IST

హిమాచల్​ ప్రదేశ్​లోని అత్యంత వ్యూహాత్మక సొరంగ మార్గంగా పరిగణించే రోహ్​తంగ్​కు ప్రభుత్వం దివంగత మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ పేరు పెట్టనుంది. బుధవారం ఆయన జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. వాజ్​పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు 2000, జూన్ మూడోతేదీన రోహ్​తంగ్​ మార్గం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ప్రపంచంలోనే పొడవైన సొరంగంగా..

8.8 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం.. 3వేల మీటర్ల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే పొడవైన సొరంగంగా పేరుగాంచనుంది. ఈ సొరంగ నిర్మాణంతో మనాలి-లేహ్​ లద్దాఖ్​ మధ్య సుమారు 46 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ప్రస్తుతం సొరంగం పనులు పూర్తికావస్తున్నాయి. ఈ సొరంగం అందుబాటులోకి వచ్చాక అన్ని కాలాల్లో హిమాచల్​-లద్దాఖ్​ మధ్య రాకపోకలు సాగనున్నాయి. గతంలో శీతాకాలంలో ఆరు నెలల పాటు ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయేవి.

ఇదీ చూడండి: 'ఎన్​ఆర్​సీ అమలుకు తొలి అడుగే ఎన్​పీఅర్'

Last Updated : Dec 25, 2019, 8:20 AM IST

ABOUT THE AUTHOR

...view details