తెలంగాణ

telangana

By

Published : May 28, 2019, 12:18 AM IST

ETV Bharat / bharat

ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజులే పనిదినాలు : సీఎం

సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఎస్​ గోలే. ఆదివారానికి అదనంగా మరో రోజును సెలవు దినంగా ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే ఉత్తర్వులు జారీ చేశారు గోలే.

ఉద్యోగులకు ఐదు రోజులే పనిదినాలు : సీఎం

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు సిక్కిం ముఖ్యమంత్రి పీఎస్​ గోలే​. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు వారంలో ఐదురోజులే పనిదినాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు గోలే. ఉద్యోగులు తమ ఆరోగ్యంపై దృష్టి సారించేందుకు, తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను దగ్గరుండి చూసుకునేందుకే ఆదివారంతో పాటు అదనంగా మరో రోజు సెలవు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

ప్రజా ప్రతినిధుల వాహనాలపైనా ఆంక్షలు

సిక్కింలో ప్రజా ప్రతినిధుల వాహనాలపైనా ఆంక్షలు విధించారు గోలే. తనతో పాటు కేబినెట్​ మంత్రులందరూ ఇక నుంచి ఫార్చ్యూనర్​ ఎస్​యువిలకు బదులుగా స్కార్పియో వాహనాలనే వినియోగించాలని ఆదేశించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీఎస్‌ గోలే ప్రమాణ స్వీకారం చేశారు.

ABOUT THE AUTHOR

...view details