తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దిశ'కు న్యాయం కోసం స్వాతి నిరవధిక నిరాహార దీక్ష - దిల్లీ మహిళా కమిషన్​

ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగారు దిల్లీ మహిళా కమిషన్​ అధ్యక్షురాలు స్వాతి మాలివాల్​. 'దిశ' కేసు నిందితులను 6 నెలల్లోగా ఉరి తీయాలని డిమాండ్​ చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసినట్టు తెలిపారు.

dcw-chief-starts-hunger-strike-over-rapes-against-women
మహిళలపై అత్యాచారాలకు నిరసనగా నిరాహార దీక్ష

By

Published : Dec 3, 2019, 3:49 PM IST

Updated : Dec 3, 2019, 5:08 PM IST

'దిశ'కు న్యాయం కోసం స్వాతి నిరవధిక నిరాహార దీక్ష

'దిశ' ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్న వేళ.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా దిల్లీ మహిళా కమిషన్​ అధ్యక్షురాలు స్వాతి మాలివాల్​ జంతర్​మంతర్​ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అత్యాచార కేసు నిందితులను 6 నెలల్లోగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు.

"రాజస్థాన్​లో ఓ ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఆమె కళ్లు కూడా బయటకు వచ్చాయి. హైదరాబాద్​లో ఓ వైద్యురాలిని అత్యాచారం చేసి కాల్చేశారు. చాలా మంది ఇందులో భాగమయ్యారు. ఇప్పుడు ఇలా ఓ ఘటన జరిగింది. తర్వాత ఇంకొకటి, మరొకటి జరుగుతాయి. ఈ దేశంలో ఇంతే. ప్రతిరోజు ఎక్కడో అక్కడ దేశంలోని అనేకమంది ఆడబిడ్డలు చనిపోతున్నారు. వారి మృతదేహాలను చూస్తే మాకు చాలా భయమేస్తుంది. నాతో పాటు దేశం మొత్తం ఎంతో ఆగ్రహంగా ఉంది. నేను నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నా."
-- స్వాతి మాలివాల్​, దిల్లీ మహిళా కమిషన్​ అధ్యక్షురాలు

మోదీకి లేఖ...

మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసినట్టు తెలిపారు స్వాతి. నిందితులకు ఆరు నెలల్లో ఉరిశిక్ష విధించాలని డిమాండ్​ చేసినట్టు పేర్కొన్నారు. చట్టాలను రూపొందిస్తే సరిపోదని.. వాటిని అమలు కూడా చేయాలన్నారు. పోలీసు వనరులను పెంచాలని అభ్యర్థించారు.

బాలికలపై జరుగుతున్న అరాచకాలకు నిరసనగా గతంలో 10 రోజులపాటు నిరాహార దీక్ష చేశారు స్వాతి.

అడ్డుకున్న పోలీసులు...?

అంతకు ముందు... దిల్లీలోని జంతర్​మంతర్​ వద్దకు చేరుకున్న వెంటనే పోలీసులు తనను అడ్డుకున్నట్టు ఆరోపించారు డీసీడబ్ల్యూ అధ్యక్షురాలు. అనుమతి లేదంటూ తనను పంపేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఓ సాధారణ మహిళను చూసి పోలీసులు, కేంద్రం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు స్వాతి.

డీసీడబ్ల్యూ అధ్యక్షురాలి ఆరోపణలపై స్పందించారు దిల్లీ పోలీసులు. తాము నిరసనలను అడ్డుకోలేదని స్పష్టం చేశారు. నిరసనలకు గల కారణాలు సహా ఇతర అంశాలపై స్పష్టత కోరుతూ డీసీడబ్ల్యూకి లేఖ రాసినట్టు వివరించారు.

Last Updated : Dec 3, 2019, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details