తెలంగాణ

telangana

By

Published : Feb 21, 2020, 2:48 PM IST

Updated : Mar 2, 2020, 1:50 AM IST

ETV Bharat / bharat

మరోసారి భారత్​కు ఇవాంక- ట్రంప్​తో కలిసి రాక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సపరివార సమేతంగా భారత్​లో పర్యటించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన భార్య మెలానియా ట్రంప్​.. భారత్​ పర్యటనకు సిద్ధమవుతుండగా, కుమార్తె ఇవాంక, అల్లుడు జారెడ్​ కుష్నర్​​ కూడా ఈ జాబితాలో చేరినట్టు తెలుస్తోంది.

Daughter Ivanka and son-in-law Jared to accompany Donald Trump to India
మరోసారి భారత్​కు ఇవాంక- ట్రంప్​తో కలిసి రాక

మరోసారి భారత్​కు ఇవాంక- ట్రంప్​తో కలిసి రాక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో పాటు ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్​ కూడా వచ్చే వారం భారత్​లో పర్యటించనున్నారు. ఈ విషయంపై శ్వేతసౌధం ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. ఇవాంక రాక కచ్చితమని అక్కడి అధికారులు చెబుతున్నారు.

ట్రంప్​ బృందంలో ఇవాంక భర్త జారెడ్​ కుష్నర్​​ కూడా ఉండనున్నారు. భార్య మెలానియాతో కలిసి ట్రంప్​ ఈ నెల 24,25న అహ్మదాబాద్​, ఆగ్రా, దిల్లీలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో పనులు శెరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ పర్యటనలో ఇవాంక, కుష్నర్​​ కూడా తోడవటం వల్ల భారత్​కు​ ట్రంప్​ సపరివార సమేతంగా వస్తున్నట్టే.

అధికారిక హోదాలో...

ఇవాంక, జారెడ్​ ప్రస్తుతం ట్రంప్​ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నారు. ట్రంప్​కు సీనియర్​ సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరూ అధికారిక హోదాలోనే భారత్​లో పర్యటించనున్నారు. ట్రంప్​తో కలిసి మోదీతో చర్చల్లో పాల్గొనే ఉన్నతస్థాయి బృందంలో సభ్యులుగా ఉండనున్నారు.

ప్రపంచదేశాల పారిశ్రామికవేత్తల సదస్సు కోసం 2017లో ఇవాంక ట్రంప్​ హైదరాబాద్​లో పర్యటించారు.

ఇదీ చూడండి:-ట్రంప్​ మనసులో ఏముంది..? వాణిజ్య ఒప్పందమా? ప్యాకేజీనా?

Last Updated : Mar 2, 2020, 1:50 AM IST

ABOUT THE AUTHOR

...view details