అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ కూడా వచ్చే వారం భారత్లో పర్యటించనున్నారు. ఈ విషయంపై శ్వేతసౌధం ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. ఇవాంక రాక కచ్చితమని అక్కడి అధికారులు చెబుతున్నారు.
ట్రంప్ బృందంలో ఇవాంక భర్త జారెడ్ కుష్నర్ కూడా ఉండనున్నారు. భార్య మెలానియాతో కలిసి ట్రంప్ ఈ నెల 24,25న అహ్మదాబాద్, ఆగ్రా, దిల్లీలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో పనులు శెరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ పర్యటనలో ఇవాంక, కుష్నర్ కూడా తోడవటం వల్ల భారత్కు ట్రంప్ సపరివార సమేతంగా వస్తున్నట్టే.
అధికారిక హోదాలో...