కర్ణాటక మైసూర్లో రెండు చిరుతలు పోరాటం చేసుకున్న దృశ్యాలు... ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. నాగర్హొళె జోన్లోని ధమ్మనకట్టె అభయారణ్యంలో విహారానికి వెళ్లిన కొంతమంది ఔత్సాహికులు ఈ చిరుతల పోరాటాన్ని చిత్రీకరించారు.
కాస్త చోటు కోసం చిరుతల ఆధిపత్య పోరాటం
కర్ణాటక ధమ్మనకట్టె అభయారణ్యంలో రెండు చిరుతలు పోరాటం చేశాయి. కొంత మంది ఔత్సాహితులు దాన్ని చిత్రీకరించారు. తాజాగా ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
కాస్త చోటు కోసం చిరుతల యుద్ధం
అభయారణ్యంలో ఉన్న నల్ల చిరుత, మచ్చల చిరుత గత కొన్ని రోజులుగా కలిసి ఉన్నట్లు ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఓ చెట్టుపై విశ్రాంతి తీసుకునే విషయంలో ఈ చిరుతలు పరస్పరం కొట్లాటకు దిగాయి. ఒళ్లు గగుర్పొడిచే ఈ పోరాటంలో నల్లచిరుత చెట్టుపై నుంచి పడిపోయింది. దాని ముఖానికి గాయాలయ్యాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇదీ చూడండి: మేమూ ఒంటరిగానే బరిలో దిగుతాం: ఆర్ఎల్డీ