పలు రాష్ట్రాల్లో పౌరసత్వ చట్టసవరణకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. నిరసనల దృష్ట్యా దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట సహా పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. 14 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూలోనూ పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. కొన్నిచోట్ల సమాజ్వాదీ పార్టీ నేతలు ఆంక్షలను లెక్కచేయకుండా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
బిహార్లో రైల్రోకో..
పౌరచట్టానికి వ్యతిరేకంగా బిహార్ రాజధాని పట్నాలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆందోళనలు చేపట్టింది. రాజేంద్ర నగర్ రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్పై నిరసనలు చేపట్టి రైల్ రోకో నిర్వహించింది.
దర్భాంగాలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రైల్రోకో నిర్వహించారు.
కర్ణాటకలో బంద్...
కర్ణాటకలోనూ పౌర చట్ట వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి వామపక్షాలు, ముస్లిం వర్గాలు. ఈ నేపథ్యంలో బెంగళూరులో 144 సెక్షన్ విధించారు అధికారులు.