తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిరసనల వల్లే దేశవ్యాప్త ఎన్​ఆర్​సీపై భాజపా వెనక్కి! - BJP to withdrawn NRC implementation nationwide by protests

జాతీయ పౌర పట్టిక (ఎన్​ఆర్​సీ) దేశవ్యాప్తంగా అమలు చేయాలనే ఆలోచనపై కేంద్రం పునరాలోచనలో పడిందా? ఆందోళనల నేపథ్యంలో భాజపా వెనక్కి తగ్గిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విపక్షాలు ఎన్​ఆర్​సీపై గగ్గోలు పెట్టినా దేశవ్యాప్తంగా అమలు చేసి తీరుతామని పలు సందర్భాల్లో ప్రకటించిన కేంద్రం.. ఇప్పుడు వెనక్కి తగ్గేందుకు ఆందోళనలే కారణమా? లేదా మరేదైనా ఉందా?

BJP to withdrawn  NRC implementation nationwide by protests
నిరసనల వల్లే దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ అమలుపై భాజపా వెనక్కి!

By

Published : Dec 25, 2019, 12:40 PM IST

జాతీయ పౌర పట్టిక (ఎన్​ఆర్​సీ).. దేశవ్యాప్తంగా అమలు చేసి అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి పంపించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఎన్​ఆర్​సీపై అనేక సందర్భాల్లో భాజాపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోమంత్రి అమిత్​ షా సహా పలువురు నేతలు ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. అయితే.. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో భాజపా వెనక్కి తగ్గిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. విమపక్షాల విమర్శలు, ప్రజల నుంచి ఎదురవుతోన్న వ్యతిరేకతతో ఎన్​ఆర్​సీ దేశవ్యాప్త అమలుపై పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది భాజపా.

ఊతమిస్తోన్న ప్రధాని ప్రకటన..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎన్​ఆర్​సీ దేశవ్యాప్త అమలుపై భాజపా వెనక్కి తగ్గిందనే ఆలోచనలకు ఊతమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఏనాడూ చర్చించలేదని ప్రకటించారు మోదీ. ప్రధాని ప్రసంగంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. కేంద్ర హోంమంత్రి దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీని అమలు చేసి తీరుతామని పలు సందర్భాల్లో స్పష్టం చేశారని.. దానికి విరుద్ధంగా ప్రధాని మాట్లాడుతున్నారని ఆరోపించాయి. పౌర చట్టంపై ఆందోళనల నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకు భాజపా అసత్యాలు చెబుతోందని పేర్కొన్నాయి.

అసోంతో గందరగోళం..

సుప్రీం కోర్టు ఆదేశాలతో అసోంలో ఎన్​ఆర్​సీని చేపట్టారు. అక్కడ సుమారు 19 లక్షల మందికిపైగా ఎన్ఆర్​సీ తుది జాబితాలో చోటు లభించలేదు. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. అయితే.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సహా భాజపా అగ్రనేతలు దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టికను తీసుకొస్తామని ప్రకటించారు. దీనిపై దేశ ప్రజల్లో గందరోగళం నెలకొంది. 1971 కన్నా ముందు ఉన్న తమ పూర్వీకుల పత్రాలు అడుగుతారని, సరైన పత్రాలు చూపించకపోతే పౌరసత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందనే అభద్రతాభావానికి గురయ్యారు ప్రజలు.

ఆందోళనలు..

జాతీయ పౌర పట్టికపై గందరగోళ పరిస్థితి నెలకొన్న తరుణంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు ప్రజలు. ఎన్​ఆర్​సీని దేశవ్యాప్తంగా అమలు చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. బంగాల్​లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు కూడా.

పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ.. ఎన్​ఆర్​సీని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: రోహ్​తంగ్​కు మాజీ ప్రధాని వాజ్​పేయీ పేరు!

ABOUT THE AUTHOR

...view details