తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకలో కొత్త ప్రభుత్వం- సీఎంగా యడ్డీ ప్రమాణం - రాజ్​భవన్​

ఎమ్మెల్యేల రాజీనామాతో తలెత్తిన మూడు వారాల హైడ్రామాకు తెరపడిన కొద్ది రోజుల్లోనే కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. శాసనసభలో అతిపెద్ద పార్టీగా ఉన్న భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా కర్ణాటక భాజపా అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు.

కర్ణాటకలో కొత్త ప్రభుత్వం- సీఎంగా యడ్డీ ప్రమాణం

By

Published : Jul 26, 2019, 6:59 PM IST

Updated : Jul 26, 2019, 7:11 PM IST

కర్ణాటకలో మరోసారి భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. ఆ పార్టీ సీనియర్​ నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా యడ్యూరప్పతో ప్రమాణం చేయించారు.

సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం

నేడు యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణం చేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం.

ఇదీ జరిగింది..

ఈనెల 23న కాంగ్రెస్‌-జేడీఎస్‌ సర్కారు పతనమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాను ఆహ్వానించాలని గవర్నర్‌ను యడ్యూరప్ప ఈ రోజు ఉదయం కోరారు. అందుకు ఆయన సమ్మతించారు.

Last Updated : Jul 26, 2019, 7:11 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details