తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం ఎన్​ఆర్​సీపై దీదీ ఆందోళన.. అమిత్​ షాకు లేఖ - అసోం పౌర జాబితా

ప్రధాని నరేంద్రమోదీని కలిసిన మరుసటి రోజే కేంద్ర హోం మంత్రి అమిత్​ షాతో భేటీ అయ్యారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అసోం జాతీయ పౌర జాబితాలో 19 లక్షల మంది పేర్లు లేకపోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిజమైన భారతీయులందరికీ సాయం అందించాలని కోరుతూ కేంద్ర మంత్రికి లేఖ అందించారు.

అసో ఎన్​ఆర్​సీపై దీదీ ఆందోళన.. షాకు లేఖ

By

Published : Sep 19, 2019, 3:36 PM IST

Updated : Oct 1, 2019, 5:16 AM IST

అసోం ఎన్​ఆర్​సీపై దీదీ ఆందోళన.. అమిత్​ షాకు లేఖ

కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అసోం జాతీయ పౌర జాబితాపై ఆందోళన వ్యక్తం చేశారు తృణమూల్​ అధినేత్రి. దిల్లీ నార్త్​బ్లాక్​లో ఆయన కార్యాలయానికి వెళ్లి ఎన్​ఆర్​సీపై చర్చించారు.

అసోం పౌర జాబితాలో పేరు దక్కని వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లేఖ అందించారు మమతా. జాబితాలో చాలా మంది నిజమైన భారతీయులు చోటుకోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బంగాల్​ ఎన్​ఆర్​సీ అమలు అంశంపై విలేకరులు అడగగా... హోంమంత్రి అదేం మాట్లాడలేదని తెలిపారు మమత. తాను వచ్చింది అసోం ఎన్​ఆర్​సీపై మాట్లాడడానికే తప్ప బంగాల్​ అంశం కాదన్నారు.

"హోంమంత్రికి ఒక లేఖ అందజేశా. అసోం జాతీయ పౌర జాబితాలో చోటు దక్కని 19 లక్షల మందిలో చాలా మంది హిందీ, బెంగాలీ మాట్లాడేవారు, గుర్కాలు, స్థానిక అస్సామీలు ఉన్నట్లు చెప్పా. చాలా మంది నిజమైన ఓటర్ల పేర్లు జాబితాలో లేవు. వారిని తప్పకుండా భారతీయులుగా గుర్తించాలి. ఈ అంశంపైనే అధికారికంగా లేఖ సమర్పించా. పశ్చిమ బంగాలో ఎన్​ఆర్​సీ అమలుపై ఆయన ఏం ప్రస్తావించలేదు."

- మమతాబెనర్జీ, పశ్చిమ బంగ ముఖ్యమంత్రి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బుధవారం సమావేశమయ్యారు మమత. బంగాల్​ రాష్ట్రం పేరు మార్పు సమస్యపై చర్చించారు. రాష్ట్రంలోని బొగ్గు గని ప్రారంభానికి రావాలని మోదీని ఆహ్వానించారు.

ఇదీ చూడండి: 'చిదంబరం కస్టడీ పొడిగించండి': దిల్లీ కోర్టుకు సీబీఐ వినతి

Last Updated : Oct 1, 2019, 5:16 AM IST

ABOUT THE AUTHOR

...view details