తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం: 1,615 మంది 'బోడో'​ ఉద్యమకారులు సరెండర్​ - నేషనల్ డెమోక్రటిక్​ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ 1,615 మంది సభ్యులు

అసోం రాష్ట్రానికి చెందిన నేషనల్ డెమోక్రటిక్​ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్​డీఎఫ్​బీ)కు చెందిన 1,615 మంది సభ్యులు ప్రభుత్వానికి లొంగిపోయారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. ఆయన సమక్షంలోనే వారి ఆయుధాలను ప్రభుత్వానికి సమర్పించారు దళ సభ్యులు.

అసోం: 1,615 మంది బోడో​ ఉద్యమకారులు సరెండర్​

By

Published : Jan 30, 2020, 6:10 PM IST

Updated : Feb 28, 2020, 1:34 PM IST

అసోం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక విజయం సాధించింది. నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్​ ఆఫ్​ బోడోలాండ్​ (ఎన్​డీఎఫ్​బీ)లోని మూడు దళాలకు చెందిన 1,615 మంది కార్యకర్తలు ప్రభుత్వానికి లొంగిపోయారు. అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్, రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ సమక్షంలో తమ ఆయుధాలను సమర్పించారు.

అసోం ప్రభుత్వం బోడో సంస్థలతో ఓ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం రాష్ట్రానికి, ప్రజల 'బంగారు భవిష్యత్తు'కు మార్గమని కేంద్ర హోంమంత్రి అమిత్​షా పేర్కొన్నారు. ఒప్పందం జరిగిన 3 రోజులకే వీరంతా సరెండర్​ అవటం విశేషం.

అసోం: 1,615 మంది బోడో​ ఉద్యమకారులు సరెండర్​

లొంగిపోయిన వారిలో ఎన్​డీఎఫ్​బీ ప్రోగ్రెసివ్​కు చెందిన 836 మంది, ఎన్​డీఎఫ్​బీ రన్​జన్​ డైమరీ వర్గానికి చెందిన 579 మంది, బి సౌరైగ్వ్రా నేతృత్వంలోని 200 మంది సభ్యులు ఉన్నారు. వీరి వద్ద ఉన్న ఏకే-47లు, లైట్​ మిషన్​, స్టెన్​ తుపాకీలతో సహా మొత్తం 4,800 ఆయుధాలను సమర్పించారు.

"దేశంలోనే కాకుండా, ఆగ్నేయాసియాలోనే అభివృద్ధి రాష్ట్రంగా అసోం నిలవడానికి మేం కృషి చేస్తున్నాం. హింసా మార్గాన్ని వదిలి అభివృద్ధిలో ముందుకు సాగటానికి వీరంతా ముందుకు వచ్చారు."
- శర్బానంద సోనోవాల్​, అసోం ముఖ్యమంత్రి.

Last Updated : Feb 28, 2020, 1:34 PM IST

ABOUT THE AUTHOR

...view details