తెలంగాణ

telangana

By

Published : Nov 20, 2020, 9:20 PM IST

ETV Bharat / bharat

'అధికరణ-370 పునరుద్ధరణ జరగని పని'

భాజపా జాతీయ ప్రతినిధి షాన్​వాజ్​ హుస్సేన్​.. జమ్ముకశ్మీర్​పై కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్​లో 'అధికరణ 370'ఎప్పటికీ పునరుద్ధరణ కాదని తేల్చి చెప్పారు. స్వర్గం లాంటి కశ్మీర్​ను 'గుప్కార్ గ్యాంగ్​' నరకంలాగా మార్చిందని ఆరోపించారు.

Article 370 can never be restored in Jammu and Kashmir: Shahnawaz Hussain
'స్వర్గం లాంటి కశ్మీర్​ను నరకంలా మార్చింది వారే'

జమ్ము కశ్మీర్​లో అధికరణ 370 రద్దయిన తరువాత మొదటిసారి కశ్మీర్​లో శుక్రవారం పర్యటించారు భాజపా జాతీయ ప్రతినిధి షాన్​వాజ్ హుస్సేన్​. కశ్మీర్​లో అధికరణ 370 ఎప్పటికీ పునరద్ధరణ కాదని తెలిపారు. జమ్ముకశ్మీర్​ ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఆర్టికల్​ 370ను రద్దు చేశామన్నారు. స్థానిక ఎన్​సీ, పీడీపీ పార్టీలు తమ కుటుంబాల కోసం పనిచేశాయే కానీ ప్రజలకు పట్టించుకోలేదని దుయ్యబట్టారు.

కశ్మీర్ పర్యటకంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిందని.. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే డీడీసీ ఎన్నికల్లో కశ్మీర్​లో కమలం విరబూస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు కశ్మీర్​లో పేరుకుపోయిన అవినీతిని రూపుమాపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని భాజపా సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్​ నఖ్వీ తెలిపారు. 'గుప్కార్​ కూటమి' కశ్మీర్​కు ప్రమాదమన్నారు.

ABOUT THE AUTHOR

...view details