తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Viral: నడిరోడ్డుపై యువకుడిని కొట్టి చంపిన దుండగులు - యువకుడిని హత్య చేసిన దుండగులు

మధ్యప్రదేశ్​లోని ఉజ్జయనీ​లో అమానవీయ ఘటన జరిగింది. ఓ యువకుడిని కొందరు వ్యక్తులు కర్రలతో చితకబాదారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

mp murder, accused beaten to death
mp murder

By

Published : May 30, 2021, 10:15 AM IST

యువకుడిపై దాడి దృశ్యాలు

మధ్యప్రదేశ్ ఉజ్జయనీ జిల్లాలో దారుణం జరిగింది. నీలంగా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లవకుశ్‌ నగర్‌లో గోవింద్‌ అనే యువకుడిని కొందరు వ్యక్తులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలైన బాధిత యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు.

దాడికి సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి చరవాణిలో బంధించడంతో మే 28న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అశు, విశాల్, భాయి, లాలా, సాగర్, గోలు తో సహా ఇతరులు ఈ దాడిలో పాల్గొన్నట్లు ఎస్​పీ అమరేంద్ర సింగ్​ తెలిపారు. దీనిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:Viral: విష సర్పానికి నోటితో ఆక్సిజన్​!

ABOUT THE AUTHOR

...view details