sitara

ETV Bharat / tv-and-theater

వేసవిలో వస్తున్న మహర్షి - release

మహర్షి చిత్రం రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. పూజా హెగ్డే, సోనల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు.

మహర్షి

By

Published : Feb 27, 2019, 3:02 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు నటిస్తున్న మహర్షి చిత్రం విడుదల తేదీ ఖరారైంది. వేసవి కానుకగా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్​ తన ట్విట్టర్​లో పంచుకున్నాడు.

మహర్షిలో పూజా హెగ్డే, సోనల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అల్లరినరేశ్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినిదత్, ప్రసాద్ వి. పోట్లూరి నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాత్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా మహేశ్ బాబు నటిస్తున్న 25వ చిత్రం. గతంలో మహేశ్ నటించిన పోకిరి, భరత్ అనే నేను చిత్రాలూ ఏప్రిల్​లోనే విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో ఈ చిత్రం విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాడు ప్రిన్స్.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details