sitara

ETV Bharat / tv-and-theater

సేనకు తారల సలాం!

పాక్​పై భారత వాయుసేన నిర్వహించిన మెరుపు దాడులపై సినీతారలు ట్విట్టర్​లో హర్షం వ్యక్తం చేశారు.

By

Published : Feb 26, 2019, 2:16 PM IST

సినీ తారలు

పాకిస్థాన్​లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో వందల సంఖ్యలో ఉగ్రవాదులు హతమై ఉంటారని అంచనా. పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్​ ఎయిర్​ఫోర్స్ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ చర్యపై సినీ తారలు ట్విట్టర్​లో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

రామ్​చరణ్
'ఇండియా స్ట్రైక్స్ బ్యాక్' అంటూ మెగా పవర్​స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. భారత వాయుసేనను చూసి గర్వంగా ఉందని ట్విట్టర్​లో హర్షం వ్యక్తం చేశాడు.

సమంత అక్కినేని
యుద్ధాలు ఇలా ప్రారంభం కావు.. కానీ ఇలాగే అంతమౌతాయి అని సమంత ట్వీట్ చేసింది.

రాజమౌళి
భారత వాయుసేనకు సెల్యూట్.. జై హింద్ అని జక్కన్న రాజమౌళి ట్వీట్ చేశాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details