sitara

ETV Bharat / cinema

షియోమీతో రణ్​వీర్

భారతలో మొబైల్ విక్రయాల్లో జోరు చూపిస్తున్న షియోమీ..తమ బ్రాండ్ అంబాసిడర్​గా బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్​వీర్​తో ఒప్పందం కుదుర్చుకుంది.

By

Published : Feb 26, 2019, 12:03 AM IST

రణ్​వీర్ సింగ్

చైనీస్ దిగ్గజ మొబైల్ సంస్థ షియోమీ భారత్​లో తమ ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు రణ్​వీర్ సింగ్​ను ఎంపిక చేసుకుంది. భాగస్వామ్యానికి సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు.

దేశంలో తక్కువ మంది మాత్రమే ఆన్​లైన్​లో చరవాణులు కొంటున్నారు. మిగతా వారిని ఆకట్టుకోవాలంటే బ్రాండ్​కు ప్రచారం కల్పించి వారిని ఆకర్షించాలి. అందుకే రణ్​వీర్​తో ఒప్పందం కుదుర్చుకున్నాం
--అనుజ్ శర్మ, షియోమీ ఇండియా ఛీప్ మార్కెటింగ్ ఆఫీసర్.

2018లో తన స్మార్ట్​ఫోన్ మార్కెట్​ను భారత్​లో విస్తరించింది షియోమీ. 28 శాతం వాటా​తో ముందంజలో నిలిచింది. 24 శాతం షేర్​తో సామ్​సంగ్ రెండో స్థానంలో ఉంది. మొదటగా ఆన్​లైన్​లో అమ్మకాలు ప్రారంభించిన షియోమీ.. గత కొన్ని నెలల నుంచి ఆఫ్​లైన్ మార్కెట్​లోనూ ఆధిపత్యం చూపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details