sitara

ETV Bharat / cinema

భారత సినిమాలపై నిషేధం

పాక్​ చేసిన పుల్వామా ఉగ్రదాడికి  భారత్ ప్రతీకారం తీర్చుకుంది.​ మంగళవారం మిరాజ్​ యుద్ధవిమానాలతో పాక్​ ఆధీనంలో ఉన్న ఉగ్రస్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఫలితంగా భారతీయ చిత్రాలను పాకిస్థాన్​లో నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దాయాది దేశం.

By

Published : Feb 26, 2019, 11:39 PM IST

భారత సినిమాలపై నిషేధం

పాక్​ ప్రభుత్వం గురువారం భారత్​కు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకుంది. భారతీయ చిత్రాలు ఆ దేశంలో విడుదల కాకుండా ఆంక్షలు విధించింది. భారతీయ చిత్రాలను బహిష్కరించాలని పాకిస్థాన్​ సినిమా పంపిణీదారుల సంఘాలకు ఆదేశాలిచ్చింది ఆ దేశం. భారత్​లో చిత్రీకరించిన ప్రకటనలనూ పాక్​లో ప్రసారం కాకుండా చూడాలని పీఈఎమ్​ఆర్​ఏ(పాకిస్థాన్​ ఎలక్రానిక్​ మీడియా రెగ్యులేటరీ అథారిటీ)కి సూచనలు చేసింది. ఈ విషయాన్ని పాక్​ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవడ్​ హుస్సేన్ మీడియాకు వెల్లడించాడు.

పాక్​ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవడ్​ హుస్సేన్
  • మనంముందే...

పుల్వామాలో సీఆర్పీఎఫ్​ ఉగ్రదాడిని నిరసిస్తూ భారత చలన చిత్ర రంగం పాక్​ నటీనటులపై నిషేధం విధించింది. ఆ దేశానికి సంబంధించిన నటులను భారత్​లో అడుగుపెట్టనివ్వకూడదని ప్రముఖులుముక్త కంఠంతోపిలుపునిచ్చారు.

  1. అనంతరం టోటల్​ ధమాల్​, లూకా చుప్పి, అర్జున్​ పటియాలా, నోట్​బుక్​, కబీర్​ సింగ్​ సినిమాల నిర్మాతలు...పాక్​లో చిత్రాలను విడుదల చేయబోమని ప్రకటించారు. పాక్​లో విడుదల చేయకపోతే నష్టమేమీ లేదంటూ భారత సినీ రంగం అభిప్రాయం వ్యక్తం చేసింది.
  • కారణమేంటి..?

పుల్వామా ఉగ్రదాడికి 12 రోజుల్లో భారత్​ ప్రతీకారం తీర్చుకుంది. భారత వైమానిక దళం బాంబులకు జైషే మహ్మద్​​ శిక్షణా శిబిరంలోని ఉగ్రవాదులు, సీనియర్​ కమాండర్లు 350 మందికి పైగా హతమైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details