ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 28, 2019, 11:48 PM IST

ETV Bharat / state

రామసుబ్బారెడ్డికి తెదేపా కార్యకర్తల ఘన స్వాగతం

మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి... కడప జిల్లా గుండ్లకుంటలో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఓ హత్య కేసు నుంచి బయటపడిన తమ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు.

రామసుబ్బారెడ్డికి తెదేపా కార్యకర్తలు ఘన స్వాగతం

రామసుబ్బారెడ్డికి తెదేపా కార్యకర్తలు ఘన స్వాగతం

మాజీ మంత్రి , తెదేపా సీనియర్ నాయకుడు పొన్నపు రెడ్డి రామ సుబ్బారెడ్డికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇటీవల షాద్ నగర్ జంట హత్య కేసుకు సంబంధించి.. సుప్రీంకోర్టు ఆయనను నిర్దోషిగా తేలుస్తూ కేసు కొట్టివేసింది. సుమారు 29 ఏళ్లపాటు ఈ హత్య కేసు విచారణ కొనసాగింది. చివరకు ఆ కేసును సుప్రీం ధర్మాసనం కొట్టివేయగా... రామసుబ్బారెడ్డికి ఊరట కలిగింది. దిల్లీ నుంచి ఆయన స్వగ్రామమైన... కడప జిల్లా పెద్దముడియం మండలం గుండ్లకుంటకు చేరుకున్నారు. తెదేపా కార్యకర్తలు, అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details