ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 23, 2021, 10:01 AM IST

ETV Bharat / state

కరోనాపై బైక్ ర్యాలీతో పోలీసుల అవగాహన

ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించేందుకు కడప జిల్లా రైల్వేకోడూరు పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టి కొవిడ్ సూచనలు చేశారు.

Police motorcycle rally
పోలీసుల మోటార్ సైకిల్ ర్యాలీ

కడప జిల్లా రైల్వేకోడూరు పోలీసులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూ.. కరోనాపై అవగాహన కల్పించారు. సర్కిల్ ఇన్​స్పెక్టర్ విశ్వనాథ రెడ్డి, రాజంపేట డీఎస్పీ శివ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా ఉండకూడదని తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details