కడప జిల్లా రైల్వేకోడూరు పోలీసులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూ.. కరోనాపై అవగాహన కల్పించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ రెడ్డి, రాజంపేట డీఎస్పీ శివ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా ఉండకూడదని తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కరోనాపై బైక్ ర్యాలీతో పోలీసుల అవగాహన
ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించేందుకు కడప జిల్లా రైల్వేకోడూరు పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టి కొవిడ్ సూచనలు చేశారు.
పోలీసుల మోటార్ సైకిల్ ర్యాలీ
TAGGED:
కడప జిల్లా తాజా వార్తలు