ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళా పోలీసులకు స్కూటీలు అందించిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి - మహిళ పోలీసులకు స్కూటీలు వితరణ చేసిన ఎమ్మెల్యే

దిశ చట్టం అమలుకు మైదుకూరు పోలీస్​స్టేషన్​లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి స్కూటీలు వితరణగా అందజేశారు. మహిళల రక్షణ, ఆర్థిక స్వావలంబన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

MLA  distributed scooters to female police at maidhukuru kadapa district
మహిళ పోలీసులకు స్కూటీలు వితరణ చేసిన ఎమ్మెల్యే

By

Published : Jul 23, 2020, 5:21 PM IST

కడప జిల్లా మైదుకూరు మహిళా పోలీసులకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి స్కూటీలను వితరణగా అందజేశారు. గురువారం పోలీస్​స్టేషన్​లో జరిగిన కార్యక్రమంలో వాహనాలను జిల్లా ఎస్పీ అన్భురాజన్​కు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మహిళల సమస్యలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారని అన్నారు.

అందుకే మహిళల పేరునే ఇళ్ల పట్టాలు, అమ్మఒడి ఇస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయ్​కుమార్, సీఐలు మధుసూదన్ గౌడ్, కొండారెడ్డి, ఇతర వైకాపా నాయకులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details