రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉద్దేశపూర్వకంగానే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిందని మాజీమంత్రి, వైకాపా నాయకుడు రామసుబ్బారెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమన్నారు. వాటి ద్వారా మారుమూల గ్రామపంచాయతీలు సైతం అభివృద్ధి చెందుతాయని తెలిపారు. అలాంటి కీలకమైన ఎన్నికలను కరోన వైరస్ కారణం చూపుతూ వాయిదా వేయడం సబబు కాదన్నారు. దీని వల్ల రాష్ట్రానికి అందాల్సిన సుమారు ఐదు వేల కోట్లు రూపాయల నిధులు అందకుండా పోతాయని వాపోయారు.
'ఉద్దేశపూర్వకంగానే వాయిదా'
ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని మాజీమంత్రి, వైకాపా నాయకుడు రామసుబ్బారెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగులోని స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలను వాయిదా వేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
జమ్మలమడుగులో మాజీమంత్రి రామసుబ్బారెడ్డి మీడియా సమావేశం