ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 23, 2020, 9:24 PM IST

ETV Bharat / state

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ముద్దనూరులో పీర్ల ఏర్పాటు

కొవిడ్ కారణంగా అట్టహాసంగా జరుపుకోవాల్సిన పండగలన్నీ నిరాడంబరంగా జరుగుతున్నాయి. అయితే మొహర్రం పండుగ సందర్భంగా... కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కడప జిల్లాలో పాలనాధికారి ఆదేశాల మేరకు పీర్లను ఏర్పాటు చేశారు.

all set for moharram celebrations in kadapa with covid instructions
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ముద్దనూరులో పీర్ల ఏర్పాటు

కరోనా కారణంగా ప్రధాన పండుగలన్నీ నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఉగాది నుంచి మొదలుకొని వినాయక చవితి వరకు పండగలకు కళ తప్పింది. అయితే మొహర్రం పండుగ ముస్లింలదే అయినా... హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలిసి జరుపుకుంటారు. కరోనా నిబంధనలు ఉన్నందున జిల్లా పాలనాధికారి ఆదేశంతో... కడప జిల్లా ముద్దనూరు పట్టణం చావిడిలో పీర్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఆగస్టు 28, 29, 30 తేదీల్లో కలెక్టర్ సూచన మేరకు, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పీర్ల ఊరేగింపు కార్యక్రమం జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details