పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, నిడదవోలు నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థులు భారీగా నామపత్రాలు దాఖలు చేశారు. వైకాపా, తెదేపా, జనసేన-భాజపా అభ్యర్థులతో పాటు పలుచోట్ల స్వతంత్రులు నామినేషన్ వేశారు. చివరిరోజు అయినందున ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నామినేషన్ దాఖలుకు సమయం వృథా కాకుండా సిబ్బందిని అప్రమత్తం చేశారు.
ఆచంట నియోజవర్గవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ కార్యక్రమం బుధవారం కోలాహలంగా జరిగింది. 4 మండలాల నుంచి 64 ఎంపీటీసీ స్థానాలకు వైకాపా, తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు.