ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 11, 2020, 4:16 PM IST

ETV Bharat / state

పశ్చిమగోదావరి జిల్లాలో చివరిరోజు భారీగా నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల చివరి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో అధిక సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. జిల్లాలోని తణుకు, నిడదవోలు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు.

zptc mptc nominations in west godavari district
నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులు

పశ్చిమగోదావరి జిల్లాలో చివరిరోజు భారీగా జడ్పీటీసీ నామినేషన్లు

పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, నిడదవోలు నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థులు భారీగా నామపత్రాలు దాఖలు చేశారు. వైకాపా, తెదేపా, జనసేన-భాజపా అభ్యర్థులతో పాటు పలుచోట్ల స్వతంత్రులు నామినేషన్ వేశారు. చివరిరోజు అయినందున ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నామినేషన్ దాఖలుకు సమయం వృథా కాకుండా సిబ్బందిని అప్రమత్తం చేశారు.

ఆచంట నియోజవర్గవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ కార్యక్రమం బుధవారం కోలాహలంగా జరిగింది. 4 మండలాల నుంచి 64 ఎంపీటీసీ స్థానాలకు వైకాపా, తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు.

నరసాపురంలో పురపాలక ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి. ప్రధాన పార్టీలైన వైకాపా, తేదేపా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నరసాపురంలో 31 వార్డుల్లో ఎన్నిక జరగనుంది. మొత్తం 47,182 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 22,532, మహిళలు 24,649, ఇతరులు ఒకరు ఉన్నారు.

ఇవీ చదవండి..సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details