ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం పనులు ముమ్మరం... 2021కి ప్రాజెక్టు పూర్తే లక్ష్యం - పోలవరం ప్రాజెక్టు వార్తలు

హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం పోలవరం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2021 నాటికి ప్రాజెక్టు పూర్తవటమే లక్ష్యంగా మేఘా సంస్థ స్పిల్​వే పనులను ప్రారంభించింది.

పోలవరం ప్రాజెక్టు పనులు పునఃప్రారంభంచిన మేఘా సంస్థ

By

Published : Nov 3, 2019, 10:41 AM IST

ముమ్మరంగా సాగుతోన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు

పోలవరం ప్రాజెక్టు వద్ద రెండో రోజూ పనుల్ని మరింత ముమ్మరం చేశారు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం పనులు ప్రారంభించిన మేఘా సంస్థ స్పిల్​వే వద్ద కాంక్రీటు నిర్మాణాలను చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియ చేపట్టింది. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. గోదావరి వరదల కారణంగా స్పిల్​వే ప్రాంతమంతా దెబ్బతినటంతో పాటు పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. ఈ మేరకు ముందు నీటిని తొలగించి, కాంక్రీటు వాహనాల రాకపోకలకు వీలుగా రహదారుల్ని సిద్ధం చేస్తున్నారు. స్పిల్​వే పనుల తర్వాత కాఫర్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల్ని దశలవారీగా చేపట్టనున్నారు.

ABOUT THE AUTHOR

...view details