ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 6, 2021, 12:27 PM IST

ETV Bharat / state

ఆవు పొడిచిన ఘటనలో మహిళ దుర్మరణం

ఆవు పొడవటంతో మహిళ దుర్మరణం చెందిన ఘటన పోతునూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది.

old woman dead in cow attack at denduluru
ఆవు పొడిచిన ఘటనలో మహిళ దుర్మరణం

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం పోతునూరు గ్రామంలో ఆవు పొడవటంతో మహిళ దుర్మరణం చెందింది. ఆవుకు నీరు పెట్టడానికి వెళ్లిన సమయంలో సంఘటన చోటు చేసుకుంది. ఆవు ఒక్కసారిగా పైకి వచ్చి పొడవటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చాలాసేపటి అనంతరం ఆమెను గుర్తించిన స్థానికులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ రామ్ కుమార్ తెలిపారు. దెందులూరు పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details