ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 8, 2020, 6:50 PM IST

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం పట్టివేత

పశ్చిమగోదావరి జిల్లా రేలంగి వద్ద అక్రమంగా కారులో తరలిస్తున్న మద్యాన్ని స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Illicit liquor seized by special enforcement beuro officers at west godavari district
అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న ఎస్​ఈబీ అధికారులు

పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి వద్ద అక్రమంగా కారులో మద్యం తరలిస్తున్న వ్యక్తిని స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 160 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఉండ్రాజవరం మండలం వడ్లూరులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో పని చేస్తున్న నవీన్ కుమార్... అదే దుకాణంలోని మద్యం సీసాలను అధిక ధరలకు విక్రయించేందుకు రేలంగి తరలిస్తుండగా అధికారులు తనిఖీ చేపట్టి పట్టుకున్నారు.

ఉండ్రాజవరం మండలానికి చెందిన గణేశ్... పశ్చిమ బెంగాల్​కు చెందిన మద్యం సీసాలను.. సత్యవాడలో విక్రయిస్తుండగా స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 15 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గణేశ్ తండ్రి లారీ క్లీనర్​గా పనిచేస్తూ లారీపై పశ్చిమ బెంగాల్ వెళ్లినప్పుడు అక్కడి నుంచి సీసాలను అక్రమంగా రవాణా చేసి గణేశ్​తో అమ్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గణేశ్​ను అరెస్టు చేశామన్నారు.

ఇదీ చదవండి: రఘురామకృష్ణరాజుపై మంత్రి రంగనాథరాజు ఫిర్యాదు.. తప్పుబట్టిన ఎంపీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details