గంజాయి సేవిస్తున్న పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చింతలపూడిలో యువకులు గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై గంజాయితో పట్టణంలోని ఓ హోటల్ వద్దకు వచ్చారు. సాధారణ దుస్తుల్లో వెళ్లిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా ఎవరెవరు గంజాయి సేవిస్తున్నారనే వివరాలు సేకరించారు. అందులో నివ్వెరపోయే విషయాలు బయటికి వచ్చాయి.