ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జోరుగా సువర్ణముఖి నది వంతెన పనులు... ఆనందంలో గిరిజనులు - కొనసాగుతున్న సువర్ణముఖి నది వంతెన పనులు

విజయనగరం జిల్లా సాలూరు మండలం మరిపల్లి పంచాయతీ వెలగవలస నుంచి... మునక్కాయవలస వెళ్లేందుకు సువర్ణముఖి నది దాటాలి. ఈ నది దాటడానికి గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం ఈ నదిపై వంతెన నిర్మిస్తుండటంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

suvarnamukhi river works are in progress at vizianagaram
కొనసాగుతున్న సువర్ణముఖి నది వంతెన పనులు

By

Published : Sep 6, 2020, 8:35 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలం మరిపల్లి పంచాయతీ వెలగవలస నుంచి మునక్కాయ వలస వెళ్లేందుకు సువర్ణముఖి నది దాటాల్సి ఉంది. ప్రభుత్వం ఈ నదిపై రూ.8కోట్లతో ఓ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది.

ప్రస్తుతం ఆ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే ఆ ప్రాంతాలలోని వారంతా... నేరుగా వెలగవలస వచ్చే వీలుంటుందని గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details