విజయనగరం జిల్లా పార్వతీపురం సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు ఆధ్వర్యంలో వివిధ చోట్ల దాడులు నిర్వహించారు. కొమరాడ మండలం చిన ఖేరజ, రాజ్యలక్ష్మిపురం, పిల్లిగడ్డి కూడళ్ల వద్ద రూట్ వాచ్ చేస్తుండగా ఒడిశా నుంచి పార్వతీపురం తరలిస్తున్న 560 లీటర్ల సారాను పట్టుకున్నట్లు సీఐ అబ్దుల్ కలీం తెలిపారు. ఎనిమిది మందిని అరెస్టు చేశామన్నారు. ఈ దాడుల్లో 7 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. ఎస్ఐలు, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు.
560 లీటర్ల సారా స్వాధీనం.. ఎనిమిది మంది అరెస్ట్
విజయనగరం జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, సిబ్బంది పలుచోట్ల దాడులు నిర్వహించి భారీగా సారాను స్వాధీనం చేసుకున్నారు. సారా రవాణా చేస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
560 లీటర్ల సారా స్వాధీనం.. ఎనిమిది మంది అరెస్ట్