ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 25, 2021, 1:39 PM IST

ETV Bharat / state

ఈనెల 27న కొత్తవలసలో న్యాయ విజ్ఞాన సదస్సు

సాలూరు మండలం కొత్తవలసలో ఈనెల 27న న్యాయ విజ్ఞాన సదస్సు జరగనుంది. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి గోపితో పాటు జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రటరీ లక్ష్మీరాజ్యం పాల్గొననున్నారని స్థానిక కోర్టు జూనియర్‌ సివిల్ జడ్జీ ధనరాజు తెలిపారు. సదస్సును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

nyaya vignana sadassu
న్యాయ విజ్ఞాన సదస్సు

విజయనగరం జిల్లా సాలూరు మండలం కొత్తవలసలో ఈనెల 27న జిల్లా న్యాయమూర్తి గోపి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక కోర్టు జూనియర్‌ సివిల్ జడ్జీ ధనరాజు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు గిరిజనుల జీవన స్థితిగతులు, మౌలికవసతుల కల్పన వంటి అంశాలను చర్చిస్తారని తెలిపారు. చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల కొందరు నేరాలకు పాల్పడుతున్నారని వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి గోపితో పాటు జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రటరీ లక్ష్మీరాజ్యం పాల్గొంటారన్నారని పేర్కొన్నారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details